Hyderabad JNTUలో పార్ట్ టైం పీజీ
ABN , First Publish Date - 2021-10-11T16:40:00+05:30 IST
హైదరాబాద్, కూకట్పల్లిలోని..
హైదరాబాద్, కూకట్పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్) - పార్ట్ టైం పీజీ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల వ్యవధిగల ఎంటెక్, ఎంబీఏ ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉద్యోగులకు ప్రత్యేకించారు. దరఖాస్తు నాటికి హైదరాబాద్ పరిధిలో కనీసం ఏడాదిపాటు ఉద్యోగం చేసిన అనుభవం తప్పనిసరి. దరఖాస్తుతోపాటు ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు ఇస్తారు. ఈ ప్రోగ్రామ్లకు ఎటువంటి స్కాలర్షిప్ లభించదు.
స్పెషలైజేషన్లు: ఎంటెక్ ప్రోగ్రామ్లో ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ సిస్టమ్స్, ఎనర్జీ సిస్టమ్స్, సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, కంప్యూటర్ సైన్స్, ఇండస్ట్రియల్ మెటలర్జీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఒక్కో స్పెషలైజేషన్కు 30 సీట్లు ప్రత్యేకించారు. ఎంబీఏ ప్రోగ్రామ్లో హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఆంత్రప్రెన్యూర్షిప్ స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. ఇందులో మొత్తం 30 సీట్లు ఉన్నాయి.
అర్హత: ఎంటెక్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి స్పెషలైజేషన్కు నిర్దేశించిన విభాగాల్లో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ ఉత్తీర్ణులై ఉండాలి. సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్కు ఎమ్మెస్సీ (ఎలకా్ట్రనిక్స్) అభ్యర్థులు అనర్హులు. కంప్యూటర్ సైన్స్కు ఎంసీఏ ఉత్తీర్ణులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. బయోటెక్నాలజీకి ఎమ్మెస్సీ(ఎన్విరాన్మెంటల్ సైన్సెస్/ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ లైఫ్సైన్సెస్/ బయోటెక్నాలజీ)/ బీవీఎస్సీ/ ఎంబీబీఎస్/ బీడీఎస్/ బీఫార్మసీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్కు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం తప్పనిసరి. వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీకి ఎమ్మెస్సీ(జియోఫిజిక్స్/ జియాలజీ/ హైడ్రాలజీ/ రిమోట్ సెన్సింగ్/ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్/ అగ్రికల్చర్/ జియోస్పేషియల్/ ఎర్త్ సైన్సెస్/ అట్మాస్ఫియరిక్/ వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్) పూర్తిచేసినవారూ అర్హులే. రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎ్సకి ఎమ్మెస్సీ (జియోఇన్ఫర్మాటిక్స్/ జియోమాటిక్స్/ మేథ్స్/ ఫిజిక్స్/ జాగ్రఫీ/ అగ్రికల్చర్/ వాటర్ రిసోర్సెస్/ వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్/ జియోస్పేషియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఎర్త్ రిసోర్సెస్/ ఓషన్ సైన్సెస్)/ ఎంసీఏ/ ఎంబీఏ పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏ ప్రోగ్రామ్లో ప్రవేశానికి ఏదేని డిగ్రీ పాసైతే చాలు.
ప్రవేశ పరీక్ష: పరీక్ష సమయం గంట. ఇందులో మొత్తం 60 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. ఎంటెక్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో సంబంధిత స్పెషలైజేషన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎంబీఏ అభ్యర్థులకు అనలిటికల్/రీజనింగ్ ఎబిలిటీ, మేథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు.
సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.2000
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 14
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్కుల పత్రాలు; టీసీ; అనుభవం సంబంధిత పత్రాలు; నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్; సర్వీస్ సర్టిఫికెట్; మెడికల్ సర్టిఫికెట్(దివ్యాంగులకు మాత్రమే)
ప్రవేశ పరీక్ష తేదీలు: అక్టోబరు 28, 29, 30
వెబ్సైట్: jntuh.ac.in