పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారు: సత్యవతి రాథోడ్
ABN , First Publish Date - 2022-03-23T02:20:56+05:30 IST
గిరిజన బిల్లుపై పార్లమెంట్ను కేంద్ర మంత్రి విశ్వేశ్వర్
హైదరాబాద్: గిరిజన బిల్లుపై పార్లమెంట్ను కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ తుడు తప్పుదోవ పట్టించారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజన బిల్లుపై అబద్దాలను ఆమె ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానం మీద కూడా కేంద్ర మంత్రికి అవగాహన లేదని ఆమె ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పిన మంత్రి గిరిజనులకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.