పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ

ABN , First Publish Date - 2020-09-30T11:14:00+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్ల మెంట్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిం దని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ

 రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి

వామపక్ష నాయకుల డిమాండ్‌ 


ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 29: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్ల మెంట్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిం దని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ బిల్లులను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్షలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌.నారాయణ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెచ్చిన వ్యవసాయ బిల్లుల ద్వారా కాంట్రాక్టు వ్యవసాయానికి చట్టబద్ధత కల్పించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.


సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడువై సిద్దయ్య మాట్లాడుతూ కార్పొరెట్‌ కంపె నీల కోసం కేంద్ర ప్రభుత్వం రైతులను అన్యాయం చేసిందన్నారు.  ఈ బిల్లుల కు వైసీపీ, టీడపీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి డీవీఎన్‌ స్వామి,  నాయకులు ఎస్‌డీ సర్దార్‌, జి.ర మేష్‌, జీవీ కొండారెడ్డి, పి.వెంకట్రావు, ఉప్పుటూరి ప్రకాశరావు, ఎస్‌.లలితకు మారి, నాంచార్లు, తంబి శ్రీనివాసులు, కె.రమాదేవి, కేఎఫ్‌ బాబు, ఎస్‌డీ హు స్సేన్‌, అత్తంటి శ్రీనివాసులు, కోటేశ్వరరావు, సాయి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-30T11:14:00+05:30 IST