పార్లే బిస్కెట్లు మరింత ప్రియం

ABN , First Publish Date - 2021-11-24T09:02:47+05:30 IST

బిస్కెట్ల ధరలు 5 నుంచి 10 శాతం పెంచుతున్నట్టు పార్లే ప్రొడక్ట్స్‌ కంపె నీ ప్రకటించింది. చక్కెర, గోధుమ పిండి...

పార్లే బిస్కెట్లు మరింత ప్రియం

న్యూఢిల్లీ: బిస్కెట్ల ధరలు 5 నుంచి 10 శాతం పెంచుతున్నట్టు పార్లే ప్రొడక్ట్స్‌ కంపె నీ ప్రకటించింది. చక్కెర, గోధుమ పిండి, వంటనూనెల ధరలు భారీగా పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రస్క్‌లు, కేకుల ధరలనూ 7 నుంచి 8 శాతం వరకు పెంచింది. పార్లే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తుల ధరలను పెంచడం ఇదే మొదటిసారి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ ధరలు పెంచింది.  

Updated Date - 2021-11-24T09:02:47+05:30 IST