పార్లమెంటు పనితీరే ప్రామాణికం

ABN , First Publish Date - 2021-11-30T08:05:01+05:30 IST

: పార్లమెంటు ఎంత చక్కగా పని చేస్తోందన్న విషయంతోపాటు ఎంత అర్థవంతంగా చర్చలు జరిగాయన్న విషయాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని,...

పార్లమెంటు పనితీరే ప్రామాణికం

 బలవంతంగా దానిని స్తంభింపజేయడం కాదు: మోదీ

న్యూఢిల్లీ, నవంబరు 29: పార్లమెంటు ఎంత చక్కగా పని చేస్తోందన్న విషయంతోపాటు ఎంత అర్థవంతంగా చర్చలు జరిగాయన్న విషయాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని, అంతే తప్పితే, దానిని ఎంత బలవంతంగా స్తంభింపజేశారన్న విషయాన్ని కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సభ, సభాపతి గౌరవాన్ని నిలబెట్టాలని స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్ని ప్రశ్నలకు జవాబులు ఇస్తామని తెలిపారు.

Updated Date - 2021-11-30T08:05:01+05:30 IST