నేడు పరిటాల రవీంద్ర వర్ధంతి

ABN , First Publish Date - 2021-01-24T06:59:18+05:30 IST

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 16వ వర్ధంతిని వెంకటాపురం గ్రామంలో ఆదివారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడు పరిటాల రవీంద్ర వర్ధంతి

ఏర్పాట్లు పూర్తి

రామగిరి, జనవరి 23: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 16వ వర్ధంతిని వెంకటాపురం గ్రామంలో ఆదివారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌, కుటుంబసభ్యులు అభి మానులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పరిటాల రవీంద్ర కుటుంబసభ్యులు పరిటాల ఘాట్‌కు నివాళులర్పిస్తారు. కాగా వర్ధంతికి తరలివచ్చే అభిమానులు, నాయకులు, కార్యకర్తలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. అభిమానులు ఎంతమంది వచ్చిన ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. శనివారం మద్యాహ్నమే భోజన ఏర్పాట్లను పరిటాల సునీత ప్రారంభించారు. ఇప్పటికే అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి పనుల్లో నిమగ్నమయ్యారు. పరిటాల రవీంద్ర వర్ధంతికి రాష్ట్ర నలుమూలల నుంచే కాక కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా అభిమానులు తరలిరానున్నారు. కార్యక్రమానికి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పలువురు నా యకులు తరలిరానున్నారు. పరిటాల రవీంద్ర ఘాట్‌ను వివిధ రకాల పూలతో అలంకరించారు. పరిటాల సునీ త మాట్లాడుతూ అభిమానులు ఎవరికి వారే స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పలు ప్రాంతాల నుంచి అభిమానులు వర్ధంతి ఏర్పాట్లపై అడిగి, తెలుసుకున్నారన్నారు. పెద్దఎత్తున తరలి వస్తారనీ, ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు.




Updated Date - 2021-01-24T06:59:18+05:30 IST