మాట తప్పాడు.. మడమ తిప్పాడు..

ABN , First Publish Date - 2021-11-28T05:24:55+05:30 IST

మాటతప్పం.. మడమతిప్పం అని చెప్పే సీఎం జగన ఇప్పుడు ఆ మాటలు తప్పుతూ ప్రజల నెత్తిన భా రం వేస్తూ నరకం చూపిస్తున్నాడని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు.

మాట తప్పాడు.. మడమ తిప్పాడు..

ఓటీఎస్‌ పేరుతో దోపిడీ దుర్మార్గం..

సీఎం జగనపై మాజీ మంత్రి పరిటాల సునీత ఫైర్‌

అనంతపురం వైద్యం నవంబరు 27: మాటతప్పం.. మడమతిప్పం అని చెప్పే సీఎం జగన ఇప్పుడు ఆ మాటలు తప్పుతూ ప్రజల నెత్తిన భా రం వేస్తూ నరకం చూపిస్తున్నాడని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. శనివారం ఆమె పరిటాల శ్రీరామ్‌తో కలిసి స్థానిక స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. పేదలకు ఇళ్లు కట్టిస్తున్నామని గొప్పలు చెప్పే సీఎం ఇప్పుడు ఆ పేదల నుంచి ఓటీఎస్‌ పేరుతో రూ. వేల కోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. మాటతప్పం.. మడమతిప్పం.. అని చెప్పే జగన ఇప్పుడు పేదల ఇళ్ల సాక్షిగా ఎలా మాట తిప్పుతున్నాడో అందరికీ అర్థమవుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికి తీసుకున్న రూ.3 లక్షల రుణాన్ని మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేవలం రూ.పది వేల కోసం పేదలను రిజిస్ట్రేషన పేరుతో మభ్యపెట్టి, దోచుకొనేందుకు మోసం చేస్తున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ఆ పేదలే తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు.


Updated Date - 2021-11-28T05:24:55+05:30 IST