వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలన్నింటినీ నోట్ చేసుకుంటున్నాం: పరిటాల సునీత

ABN , First Publish Date - 2020-06-03T18:47:21+05:30 IST

అనంతపురం: పేరూరు డ్యాం వద్దకు మాజీ మంత్రి పరిటాల సునీత ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ చేరుకున్నారు.

వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలన్నింటినీ నోట్ చేసుకుంటున్నాం: పరిటాల సునీత

అనంతపురం: పేరూరు డ్యాం వద్దకు మాజీ మంత్రి పరిటాల సునీత ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ చేరుకున్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పరిటాల సునీత మాట్లాడుతూ.. వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలన్నింటిని నోట్ చేసుకుంటున్నామన్నారు. రాప్తాడు నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.


గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారన్నారు. శిలా ఫలకాల ధ్వంసంపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల కఠిన చర్యలు తీసుకోవడం లేదని సునీత విమర్శించారు. నియోజకవర్గానికి నీళ్లు ఇస్తే సంతోషించే మొదటి వ్యక్తిని తానేనన్నారు. గతంలో పేరూరు డ్యాంకు రూ. 804 కోట్లు కేటాయించామన్నారు. మద్దెలచెరువు సూరి తమ్ముడు గంగుల సుధీర్ రెడ్డి ఇలాంటి పనులు చేయిస్తున్నాడని పరిటాల సునీత విమర్శించారు. 


Updated Date - 2020-06-03T18:47:21+05:30 IST