సీఎం జగన్.. తమిళనాడులో జరిగిన ఘటన గుర్తు చేసుకో..: పరిటాల శ్రీరామ్
ABN , First Publish Date - 2021-11-20T21:02:17+05:30 IST
సీఎం జగన్పై పరిటాల శ్రీరామ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘జగన్ గుర్తించుకో.. పంచలూడదీసి కొట్టే రోజులు తొందరలోనే వస్తాయి.. తమిళనాడులో జరిగిన ఘటన ఒకసారి గుర్తు చేసుకో.. మీ తల్లి అయినా.. నా తల్లి అయినా .. ఆ తల్లి భువనేశ్వరి అయిన ఒక్కటే.. మహిళలపై ఇలాంటి విమర్శలు చేస్తారా?... మీ ఇళ్లలో ఆడవాళ్ళను అడగండి ముఖంపై ఉమ్మేస్తారు.. ఇలాంటి పద్ధతిలో ముందుకు వెళితే.. నీ పతనం మొదలైనట్లే గుర్తించుకో.. చంద్రబాబు శపథాన్ని నెరవేరుస్తాం.. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అప్పడు ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకో’’ అంటూ శ్రీరామ్ వ్యాఖ్యలు చేశారు.