పారిశుధ్యం పనులు చేపట్టాలని వినతి
ABN , First Publish Date - 2022-08-09T02:56:09+05:30 IST
ఉలవపాడులో సోమవారం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. స
ఉలవపాడు, ఆగస్టు 8 : ఉలవపాడులో సోమవారం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. సచివాలయం-2 పరిధిలోని ఒక్కొక్క ఇంటిని సందర్శించి ప్రభుత్వ పథకాల వలన ఆ కుటుంబానికి చేకూరిన లబ్ధిని చదివి వినిపించారు. ఉలవపాడులోని రిజర్వు కాలనీ నుంచి కార్యక్రమం మొదలు పెట్టగా, పంచాయతీ అభివృద్ధి పనులు తమ కాలనీలో చేపట్టలేదని, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేక మా ప్రాంతం దుర్భరంగా ఉందని మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు. వాటినన్నింటిని పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మఽధ్యాహ్న భోజన విరామం లేకుండా ఎమ్మెల్యే వెంట నడిచారు.