జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా పరిమళ
ABN , First Publish Date - 2021-12-01T05:14:14+05:30 IST
జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా ( డీటీడబ్లూవో ) పీబీకే పరిమళను నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నెల్లూరు ( వీఆర్సీ ) నవంబరు 30 : జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా ( డీటీడబ్లూవో ) పీబీకే పరిమళను నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే శాఖలో విధులు నిర్వహిస్తున్న రోశిరెడ్డి ఇప్పటి వరకు ఇన్చార్జిగా కొనసాగారు. పరిమళ పశ్చిమగోదావరి జిల్లా కోటరామచంద్రపురంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ ఉద్యోగోన్నతిపై జిల్లాకు రానున్నారు. నేడో, రేపో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.