సెలవులిచ్చే ఆలోచన లేదు.. విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదు
ABN , First Publish Date - 2022-01-18T22:50:52+05:30 IST
విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే
అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే పాఠశాలలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. పాఠశాలలు మూసివేసే ఆలోచన లేదన్నారు. సోమవారం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. పాఠశాలలు తెరవడానికి, కొవిడ్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆన్లైన్ తరగతులు ప్రత్యక్ష తరగతులకు ప్రత్యామ్నాయం కాదని, పాఠశాలలు మూసివేసే ఆలోచన లేదన్నారు. సంక్రాంతి అనంతరం విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరయ్యారని చెప్పారు. తొలిరోజు సోమవారం 61 శాతం హాజరు నమోదైందని తెలిపారు.