Parayagrajలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-04-23T17:03:42+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తమ ఇంట్లో శవమై కనిపించారు....

Parayagrajలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య

ప్రయాగరాజ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తమ ఇంట్లో శవమై కనిపించారు. వీరందరిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యానంతరం వారున్న ఇంటికి దుండగులు నిప్పు పెట్టినట్లు సమాచారం. సామూహిక హత్యలు ప్రయాగరాజ్ జిల్లాలో కలకలం రేపింది. సంఘటన స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులతోపాటు జిల్లా ఎస్పీ తరలివచ్చారు.కుటుంబసభ్యులంతా ఇంటి ప్రాంగణంలో నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు.నివాసం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా ఐదుగురు వ్యక్తులు దారుణంగా మృతి చెందినట్లు గుర్తించారు.పోలీసులు విచారణ ప్రారంభించినా హత్యకు గల కారణాలను మాత్రం ఇంకా నిర్ధారించలేకపోయారు.గత వారం నవాబ్‌గంజ్ జిల్లాలో ఓ దుండగుడు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కత్తితో పొడిచి చంపారు.


Updated Date - 2022-04-23T17:03:42+05:30 IST