‘ఎమ్మెల్యేను ఊరి నుంచి తరిమికొట్టాలి’

ABN , First Publish Date - 2021-07-27T04:36:36+05:30 IST

‘ఎమ్మెల్యేను ఊరి నుంచి తరిమికొట్టాలి’

‘ఎమ్మెల్యేను ఊరి నుంచి తరిమికొట్టాలి’
ఊరేగింపుగా వెళ్తున్న అఖిలపక్ష నాయకులు

పరకాల, జూలై 26 : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని పర కాల ఊరి నుంచి తరిమికొట్టాలని అఖిలపక్ష నాయకులు ప్రజలకు పిలుపునిచ్చా రు. సోమవారం పరకాల అమరవీరుల జిల్లా ఏర్పాటు చేయాలని డిమండ్‌ చే స్తూ అమరధామం నుంచి నీటి కుండలతో ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు జలాభిషేకంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. పరకాల జిల్లా సాధన సమితి కన్వీనర్‌ పిట్ట వీరస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవి వచ్చాక గండ్ర వెంకటర మణారెడ్డి పుట్టిన ఊరిని మరిచి పరకాల జిల్లాపై విమర్శలు చేయడం సిగ్గుచేట న్నారు. ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్రలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనా మా చేయాలని లేకుంటే, తరిమికొట్టే రోజులు వస్తాయన్నారు. కార్యక్రమంలో దు బాసి వెంకటస్వామి, మార్త భిక్షపతి, పంచగిరి జయమ్మ, డి.మేఘనాథ్‌, పరమేశ్వ ర్‌, రంజిత్‌, మంద రాంచందర్‌, బండారి కృష్ణ, అలీ, చిన్నికృష్ణ, మురళీ ఉన్నారు.

Updated Date - 2021-07-27T04:36:36+05:30 IST