ఉద్యాన పంటలతో అధిక లాభాలు
ABN , First Publish Date - 2021-08-06T05:52:13+05:30 IST
ఉద్యానపంటలపై అవగాహన కలిగి ఉండి సాగు చేస్తే మంచి లాభాలను సాధించవచ్చునని టీడీపీ బాపట్ల పార్లమెంటరీ ని యోజకవర్గ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పారు.
ఎమ్మెల్యే ఏలూరి
మార్టూరు, ఆగస్టు 5 : ఉద్యానపంటలపై అవగాహన కలిగి ఉండి సాగు చేస్తే మంచి లాభాలను సాధించవచ్చునని టీడీపీ బాపట్ల పార్లమెంటరీ ని యోజకవర్గ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పారు. గురువారం మండల పరిధిలోని తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి, అం దులో సాగు చేస్తున్న బొప్పాయి పంటను పరిశీలించారు. రైతులకు ఉద్యానపంటలపై అవగాహనతో పాటు శిక్షణ కల్పించాలన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఆధునిక యంత్రపరికరాలను అందించాలని చెప్పారు.