పన్నుల పెంపుపై వామపక్షాల నిరసన

ABN , First Publish Date - 2021-06-18T02:55:15+05:30 IST

పన్నుల పెంపుపై వామపక్షాలు నిరసన చేపట్టాయి. నాయుడుపేట మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీపీఎం,

పన్నుల పెంపుపై వామపక్షాల నిరసన
: మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న సీపీఎం, సీఐటీయూ నాయకులు

నాయుడుపేట,  జూన్‌ 17 : పన్నుల  పెంపుపై వామపక్షాలు నిరసన చేపట్టాయి. నాయుడుపేట మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీపీఎం,  సీఐటీయూ నాయకులు గురువారం నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ముకుంద  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ చట్టాలను సవరించడం ద్వారా భారీగా పన్నులు పెరుగుతాయన్నారు. చట్టసవరణలను,  జీవోలను రద్దుచేయాలన్నారు. అనంతరం కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మహేష్‌, మనోరమ్మ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-06-18T02:55:15+05:30 IST