పంజాగుట్ట ప్రధాన రోడ్డులో పొంచి ఉన్న ప్రమాదం!

ABN , First Publish Date - 2020-09-20T12:44:15+05:30 IST

పంజాగుట్ట ప్రధాన రహదారిలో ప్రమాదం పొంచి ఉంది. జాతీయ రహదారి కావడంతో ఈ మార్గంలో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. పంజాగుట్ట ఏసీపీ కార్యాలయం

పంజాగుట్ట ప్రధాన రోడ్డులో పొంచి ఉన్న ప్రమాదం!

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): పంజాగుట్ట ప్రధాన రహదారిలో ప్రమాదం పొంచి ఉంది. జాతీయ రహదారి కావడంతో ఈ మార్గంలో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. పంజాగుట్ట ఏసీపీ కార్యాలయం ఎదురుగా, సెంట్రల్‌ ఎదురుగా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం రెండు భారీ గుంతలు తవ్వారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంతల్లో వర్షపునీరు నిలిచి బావుల్లా మారాయి. ఆ దారిలో అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం పొంచి ఉంది. రక్షణ చర్యలు తీసుకున్నా అవి ఏ మాత్రం అనువుగా లేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు.

Updated Date - 2020-09-20T12:44:15+05:30 IST