మోడల్‌ పరీక్షలతో భయాందోళన దూరం

ABN , First Publish Date - 2022-06-29T05:36:01+05:30 IST

ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మోడల్‌ పరీక్షలు రాయడంద్వారా ప్రశ్నల ఎంపికతోపాటు పరీక్షా సమయంలో నెలకొనే భయాందోళనలకు గురికాకుండా ఉంటారని జేఎనటీయూ రిజిస్ర్టార్‌ శశిధర్‌ పేర్కొన్నారు.

మోడల్‌ పరీక్షలతో భయాందోళన దూరం

జేఎనటీయూ రిజిసా్ట్రర్‌ శశిధర్‌

పీవీకేకేలో 30న మోడల్‌ ఈఏపీసెట్‌

అనంతపరం సెంట్రల్‌, జూన 28: ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మోడల్‌ పరీక్షలు రాయడంద్వారా ప్రశ్నల ఎంపికతోపాటు పరీక్షా సమయంలో నెలకొనే భయాందోళనలకు గురికాకుండా ఉంటారని జేఎనటీయూ రిజిస్ర్టార్‌ శశిధర్‌ పేర్కొన్నారు. మంగళవారం ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర యాదవ్‌ ఆధ్వర్యంలో రిజిస్ర్టార్‌ శశిధర్‌ ఈఏపీసెట్‌ మోడల్‌ పరీక్ష పోటీల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజిస్ర్టార్‌ మాట్లాడుతూ విద్యార్థులను చైతన్య పరుస్తూ మోడల్‌ ఈఏపీసెట్‌ పరీక్షలను నిర్వహించడం అభినందనీయమన్నారు. సూర్యచంద్రయాదవ్‌ మాట్లాడుతూ ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో ఈనెల 30న పీవీకేకే ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈఏపీసెట్‌ మోడల్‌ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. నిపుణులచేత పశ్రపత్రాలను తయారుచేయించి ఆనలైన పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటుచేశామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల విద్యార్థులు 9949951084, 7993030128, 6302836513 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌పఐ నాయకులు అశోక్‌కుమార్‌, సంపతకుమార్‌, సాయిఉత్తేజ్‌ కుమార్‌, సంజీవ్‌, మధు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T05:36:01+05:30 IST