పనీర్‌ నిహారి

ABN , First Publish Date - 2020-05-16T15:01:12+05:30 IST

పనీర్‌ - 150 గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - ఒక టేబుల్‌స్పూన్‌, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌,

పనీర్‌ నిహారి

కావలసినవి: పనీర్‌ - 150 గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - ఒక టేబుల్‌స్పూన్‌, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, దాల్చిన చెక్క - చిన్నముక్క, సోంపు - రెండు టేబుల్‌స్పూన్లు, జాజికాయ పొడి - చిటికెడు, జాపత్రి - చిటికెడు, ఉప్పు - తగినంత, మైదా - మూడు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా. 


తయారీ: పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పనీర్‌ ముక్కలు వేసి వేగించాలి. ముదురు గోధుమరంగులోకి మారే వరకు వేగించుకున్న తరువాత ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 

అదే పాన్‌లో అల్లం వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాలపొడి, జీలకర్రపొడి, యాలకుల పొడి, దాల్చిన చెక్క, సోంపు, జాజికాయపొడి, జాపత్రి వేసి వేగించాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోయాలి.

మరొక పాత్రలో మైదా పిండిని తీసుకుని అరకప్పు నీళ్లు పోసి మెత్తగా కలపాలి. తరువాత మసాల మిశ్రమంలో పోసి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తగినంత ఉప్పు వేయాలి. 

ఇప్పుడు వేగించి పెట్టుకున్న పనీర్‌ ముక్కలు వేయాలి. చిన్నమంటపై కాసేపు ఉడికించుకొని దింపుకోవాలి.

ఈ కర్రీ రోటీలోకి లేదా అన్నంలోకి రుచిగా ఉంటుంది. 

Updated Date - 2020-05-16T15:01:12+05:30 IST