పనీర్ దోశ
ABN , First Publish Date - 2021-11-17T19:30:01+05:30 IST
పనీర్- కప్పు, అల్లం ముక్కలు- అర స్పూను, ఉల్లిగడ్డ- ఒకటి, జీలకర్ర- స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు-
కావలసిన పదార్థాలు: పనీర్- కప్పు, అల్లం ముక్కలు- అర స్పూను, ఉల్లిగడ్డ- ఒకటి, జీలకర్ర- స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు- స్పూను, పచ్చి మిర్చి- ఒకటి, టొమాటో - ఒకటి, పసుపు- అర స్పూను, కారం- స్పూను, గరం మసాలా- అర స్పూను, దోస పిండి, ఉప్పు, నూనె, వెన్న - తగినంత, కరివేపాకు, కొత్తి మీర తురుము- అర కప్పు.
తయారుచేసే విధానం: ఉల్లి, టొమాటోలను ముక్కలుగా కోసుకోవాలి. పనీర్ను తురుముకోవాలి. ఓ పాన్లో నూనె వేడి చేసి జీలకర్రను వేయాలి. ఆ తరవాత అల్లం ముక్కలు, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఉల్లి ముక్కలు జతచేయాలి. రంగుమారాక అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి. టొమాటో ముక్కలు, పసుపు, కారం, మసాలా పొడి వేసి మగ్గించాలి. పనీర్ తురుము, తగినంత ఉప్పు వేసి మూతపెట్టి రెండు నిమిషాల తరవాత దించేయాలి. పెనం మీద దోశ పిండి వేసి పైన పనీర్ మసాలా వేయాలి. సగం కాలాక వెన్న వేసి ఉడికిస్తే పనీర్ దోశ తయారు.