టీడీపీ హయాంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉంది: పంచుమర్తి
ABN , First Publish Date - 2022-02-12T21:23:11+05:30 IST
టీడీపీ హయాంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తెలిపారు. శనివారం అనురాధ మీడియాతో
అమరావతి: టీడీపీ హయాంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తెలిపారు. శనివారం అనురాధ మీడియాతో మాట్లాడుతూ ‘‘నేడు దివాళాంధ్రప్రదేశ్గా మారింది. అప్పుల కోసం ప్రభుత్వం ఆస్తుల్ని తాకట్టు పెడుతోంది. సీఎం జగన్ రెడ్డి తనఖా రెడ్డిగా మారిపోయారు. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి బాగోలేందంటూ నాటకాలు ఆడుతున్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు నవరత్నాలతో నాటకాలాడుతున్నారా?. మధ్యం ధరలు, ఆస్తిపన్ను, యూజర్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచి.. పన్నులతో ప్రజలపై అధనంగా రూ.70 వేల కోట్ల భారం మోపారు. ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డబ్బులున్నీ ఏం చేశారు? తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయా? సినిమావాళ్ల ఆత్మభిమానం దెబ్బతినేలా జగన్ వ్యవహరిస్తున్నారు’’ అని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.