పంచాయతీ ఖాతాల్లోకి ఆర్థిక సంఘం నిధులు

ABN , First Publish Date - 2020-11-25T05:01:35+05:30 IST

పంచాయతీల ఖాతాల్లో ఎట్టకేలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు జమయ్యాయి. ‘నిధులొచ్చి ఏం లాభం?’ శీర్షిక సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు.

పంచాయతీ ఖాతాల్లోకి ఆర్థిక సంఘం నిధులు

 నెల్లూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీల ఖాతాల్లో ఎట్టకేలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు జమయ్యాయి. ‘నిధులొచ్చి ఏం లాభం?’ శీర్షిక సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే కేంద్రం ఇచ్చిన నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేశారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు కొన్ని నెలల క్రితమే విడుదలయ్యాయి. అయితే పలు కారణాలతో వాటిని పంచాయతీల ఖాతాల్లో జమ చేయకుండా ట్రెజరీలోనే ఉంచారు. కానీ క్షేత్రస్థాయిలో పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించారు. 

Updated Date - 2020-11-25T05:01:35+05:30 IST