భార్యపై యాసిడ్ పోసిన భర్త

ABN , First Publish Date - 2020-08-19T10:53:09+05:30 IST

భార్యతో గొడవపడిన భర్త ఆగ్రహంతో ఆమెపై యాసిడ్ పోసిన దారుణ ఘటన....

భార్యపై యాసిడ్ పోసిన భర్త

ఇడుక్కీ (కేరళ): భార్యతో గొడవపడిన భర్త ఆగ్రహంతో ఆమెపై యాసిడ్ పోసిన దారుణ ఘటన కేరళ రాష్ట్రంలోని ఇడుక్కీ జిల్లా వత్తికూడి గ్రామంలో వెలుగుచూసింది. వత్తికూడి గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షురాలిగా శ్రీజ పనిచేస్తున్నారు. శ్రీజతో ఆమె భర్త అనీష్ గత కొంత కాలంగా గొడవ పడుతున్నాడు. భార్య శ్రీజతో విబేధాలతో గొడవపడిన భర్త అనీష్ రబ్బరు షీటులో యాసిడ్ తీసుకువచ్చి ఆమెపై పోశాడు. ఈ దాడిలో శ్రీజ తీవ్రంగా గాయపడ్డారు. శ్రీజను ఆసుపత్రిలో చేర్చారు. భార్యపై యాసిడ్ దాడి చేసిన అనీష్ పై ఐపీసీ సెక్షన్ 326 ఎ కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశామని ఇడుక్కీ జిల్లా పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-08-19T10:53:09+05:30 IST