పంచాయతీ కార్యదర్శి, సర్పంచుకు మెమో
ABN , First Publish Date - 2021-02-25T05:55:56+05:30 IST
రికార్డుల నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో బుధవారం పంచాయతీ కార్యదర్శి నవీన్, సర్పంచ్ శివులుకు డీఎల్పీవో రమణామూర్తి మెమో జారీ చేశారు.
శివ్వంపేట, ఫిబ్రవరి 24: రికార్డుల నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో బుధవారం పంచాయతీ కార్యదర్శి నవీన్, సర్పంచ్ శివులుకు డీఎల్పీవో రమణామూర్తి మెమో జారీ చేశారు. శివ్వంపేట మండలంలోని పాంబండ గ్రామ పంచాయతీని డీఎల్పీవో బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు సంబంధించి నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో చర్యలు తప్పవని అన్నారు. ఆయన వెంట ఎంపీవో లచ్చల్ ఉన్నారు.