పంచాయతీ కార్యదర్శి మృతి

ABN , First Publish Date - 2022-01-18T06:25:10+05:30 IST

మండల పరిధిలోని రామ చంద్రాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి జక్కి అంజయ్య (50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

పంచాయతీ కార్యదర్శి మృతి
అంజయ్య ఫైల్‌ ఫొటో

మృతిపై అనుమానం ఉందని రెండో భార్య ఫిర్యాదు

గరిడేపల్లి రూరల్‌, జనవరి 17: మండల పరిధిలోని రామ చంద్రాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి జక్కి అంజయ్య (50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనారోగ్య కారణాలతో  అంజయ్య సూర్యాపేట  ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం  సాయంత్రం చేరారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. అంజయ్యకు  ఇద్దరు భార్యలు ఉన్నారు. భర్త మృతిపై అనుమానం ఉందని రెండో  భార్య జక్కి నిర్మల ఫిర్యాదు మేరకు  కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ.కొండల్‌రెడ్డి తెలిపారు.





Updated Date - 2022-01-18T06:25:10+05:30 IST