పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-02-05T02:09:47+05:30 IST
జిల్లాలోని బయ్యారం మండలం నారాయణపురం గ్రామ జూనియర్ పంచాయతీ
మహబూబాబాద్: జిల్లాలోని బయ్యారం మండలం నారాయణపురం గ్రామ జూనియర్ పంచాయతీ సెక్రటరీ వీసం వెంకటేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ నోట్ రాశాడు. ప్రజా ప్రతినిధులు, అధికారుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు,పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆరోపిస్తున్నారు.