సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ అధికారి సస్పెండ్
ABN , First Publish Date - 2021-07-09T03:36:36+05:30 IST
తడి, పొడి చెత్త వేరు చేయడంలో అలక్ష్యం చేస్తున్న పంచాయతీ అధికారి నందీశ్వర్ను
సంగారెడ్డి: తడి, పొడి చెత్త వేరు చేయడంలో అలక్ష్యం చేస్తున్న పంచాయతీ అధికారి నందీశ్వర్ను కలెక్టర్ హన్మంతరావు సస్పెండ్ చేసారు. మునిపల్లి మండలంలోని పెద్దలోడి గ్రామంలో జిల్లా కలెక్టర్ హన్మంతరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆర్డబ్య్లూఎస్ ఏఈ అంగత్ కుమార్ నిర్లక్ష్యం వహించారు. గ్రామ సర్పంచ్ పార్వతి, ఏపీఎం బాగయ్య, ఏపీవో యాదగిరిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.