కర్నూల్లో బంగారు వజ్రాల నగలు స్వాధీనం..ఇద్దరు అరెస్ట్
ABN , First Publish Date - 2021-04-14T16:14:37+05:30 IST
పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. సరైన ఆధారాలు లేని బంగారు వజ్రాల నగలను స్వాధీనం చేసుకున్నారు...
కర్నూలు : పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. సరైన ఆధారాలు లేని బంగారు వజ్రాల నగలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి మధురైకి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వజ్రాల విలువ సుమారుగా రూ. కోటీ 4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు రాజకుమార్, యస్వంత్ అనే ఇద్దరు యువకులని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.