చంద్రబాబును కలిసిన పనబాక లక్ష్మీ దంపతులు
ABN , First Publish Date - 2020-11-25T21:32:46+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబును పనబాక లక్ష్మీ దంపతులు కలిశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబును పనబాక లక్ష్మీ దంపతులు కలిశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం, తదితర అంశాలపై చంద్రబాబుతో చర్చించారు. ప్రచార షెడ్యూల్, మండల కమిటీల నియామకంపై కూడా మంతనాలు జరిపారు. ప్రచారంలో పాల్గొనాలని చంద్రబాబును పనబాక లక్ష్మీ కోరారు. ఈనెల 28న తిరుపతిలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి బరిలో టీడీపీ నుంచి పనబాక లక్ష్మీ పోటీచేస్తుండగా... అధికార పార్టీ నుంచి వైసీపీ తరుపున డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతికి ఉపఎన్నిక జరుగుతోంది.