టీడీపీ బలోపేతమే లక్ష్యం
ABN , First Publish Date - 2021-01-21T05:00:35+05:30 IST
తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పని చేయాలని కేడర్కు లోకేష్ పిలుపు
పనబాక కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరు
నెల్లూరు (ఆంధ్రజ్యోతి), జనవరి 20 : తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి నెల్లూరులోని వెంకటేశ్వరపురం, మెడికోవర్ ఆసుపత్రి జంక్షన్ల వద్ద లోకేష్కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నగర ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ధర్మవరం సుబ్బారావుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. భారీ గజమాలతో లోకేష్ను కోటంరెడ్డి సత్కరించారు. టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, మహిళా విభాగం, ఇతర అనుబంధ విభాగాల నాయకులు లోకేష్ను కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ జిల్లా నేతలను ఆప్యాయంగా పలకరించారు.
చిల్లకూరు : కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, విశ్రాంత ఐఆర్టీఎస్ అధికారి పనబాక కృష్ణయ్య దంపతుల కుమార్తె, డిప్యూటీ కలెక్టర్ రచన, ఐఆర్ఎస్ అధికారి భారవ్ శేఖర్ల వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి చిల్లకూరు మండలంలోని బూదనం వద్ద ఉన్న ఏ-5 హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో నారా లోకేష్తోపాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు అమర్నాథ్రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు పాశిం సునీల్కుమార్, పరసారత్నంతోపాటు టీడీపీ నాయకులు, పనబాక అభిమానులు పాల్గొన్నారు.
పోటుపాళెం జాతీయ రహదారి కూడలి వద్ద మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ ఆధ్యర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నారా లోకేష్కు ఘనస్వాగతం పలికారు. నిమ్మకాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన భారీ మాలతో లోకేష్ను సత్కరించారు.
మనుబోలు : చిల్లకూరు నుంచి విజయవాడ వెళ్తున్న నారా లోకే్షకు మనుబోలు వద్ద టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి సోమిరెడ్డి తనయుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లోకే్షకు శాలువా కప్పి సన్మానించారు. మనుబోలు, పొదలకూరు, తోటపల్లిగూడూరు మండలాల నుంచి నాయకులు, భారీగా తరలివచ్చారు.