కరోనాతో పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కన్నుమూత

ABN , First Publish Date - 2020-08-13T00:54:05+05:30 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కరోనాతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోనే యశోద ఆస్పత్రిలో...

కరోనాతో పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కరోనాతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గతంలో కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీకాంత్ రెడ్డి పోటీ చేశారు. రాయలసీమ అభివృద్ధికి పార్టీలకతీతంగా ఆయన కృషి చేశారు. తన తండ్రి జస్టిస్ పీసీ రెడ్డి పేరుతో ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు. పాలెం శ్రీకాంత్‌రెడ్డి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ యువనేత లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2020-08-13T00:54:05+05:30 IST