పల్నాడులో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోంది: ఆలపాటి రాజా

ABN , First Publish Date - 2022-01-16T23:14:39+05:30 IST

అంతకుముందు నరసరావుపేటలో టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబును ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, అశోక్‌బాబు, పిల్లి మాణిక్యరావు..

పల్నాడులో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోంది: ఆలపాటి రాజా

గుంటూరు: ప్రశాంతంగా ఉన్న పల్నాడులో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు అన్నారు. పోలీసులు వైసీపీ నేతలకు ఊడిగం చేయవద్దని, ప్రభుత్వం మారితే వైసీపీ నేతలు రాష్ట్రం వదిలి పారిపోతారని తెలిపారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఉద్యోగాలు చేయాలని ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు సూచించారు. 


అంతకుముందు నరసరావుపేటలో టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబును ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, అశోక్‌బాబు, పిల్లి మాణిక్యరావు, బుచ్చి రాంప్రసాద్, డూండి రాకేష్, దారపనేని పరామర్శించారు.  అరవింద్‌ బాబు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని అరవింద్‌బాబు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. 

Updated Date - 2022-01-16T23:14:39+05:30 IST