సుబ్బారావును అదుపులోకి తీసుకోలేదు: పల్నాడు SP
ABN , First Publish Date - 2022-06-20T17:23:12+05:30 IST
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆందోళనల్లో కీలక వ్యక్తి, సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకోలేదని
పల్నాడు: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు (Avula subbarao)ను అదుపులోకి తీసుకోలేదని జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి (Ravishanker Reddy) తెలిపారు. భారత్ బంద్ బందోబస్తులో భాగంగా సోమవారం ఉదయం నరసరావుపేట రైల్వే స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైల్వేస్టేషన్పై దాడి ఘటనలో సుబ్బారావును ప్రశ్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పోలీసులు తమను సంప్రదించలేదని చెప్పారు. యూపీ పోలీసులు సుబ్బారావును విచారించారనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు సుబ్బారావు విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు.