పల్నాడును జిల్లాగా ప్రకటించాలి
ABN , First Publish Date - 2021-01-19T05:25:20+05:30 IST
నూతన జిల్లాల ఏర్పాటులో పల్నాడు ప్రాంతానికి అన్యాయం జరిగితే తిరుగుబాటు తప్పదని పల్నాడు జిల్లా సాధన జేఏసి కన్వీనర్ చెవుల కృష్ణాంజనేయులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పల్నాడు జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ కృష్ణాంజనేయులు
గుంటూరు(తూర్పు), జనవరి 18: నూతన జిల్లాల ఏర్పాటులో పల్నాడు ప్రాంతానికి అన్యాయం జరిగితే తిరుగుబాటు తప్పదని పల్నాడు జిల్లా సాధన జేఏసి కన్వీనర్ చెవుల కృష్ణాంజనేయులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలగా ప్రకటించడం అశాస్త్రీయమైన పద్ధతి అని అన్నారు. దీనిపై బుధవారం పిడుగురాళ్ళలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అంగిరేకుల వరప్రసాదు, బత్తుల వీరస్వామి, యలమందారెడ్డి, వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.