TDP Leader జల్లయ్య అంత్యక్రియలపై అయోమయం
ABN , First Publish Date - 2022-06-04T19:16:10+05:30 IST
వైసీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియలపై అయోమయం నెలకొంది.
పల్నాడు: వైసీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియలపై అయోమయం నెలకొంది. జల్లయ్య మృతదేహాన్ని పోలీసులు హడావుడిగా రావులాపురం తరలించారు. కుటుంబ సభ్యులు ప్రమేయం లేకుండా మృతదేహాన్ని ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం రావులాపురంలో అంబులెన్స్లోనే మృతదేహాన్ని ఉంచారు. కాగా... జల్లయ్య అంత్యక్రియాలకు గ్రామస్తులు సహకరించని పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు కోసం పోలీసులు పడిగాపులు కాస్తున్నారు.
.