Palnaduలో దారి దోపిడి

ABN , First Publish Date - 2022-05-23T13:40:11+05:30 IST

జిల్లాలోని సత్తెనపల్లి శ్రీరామ్ చిట్స్ దగ్గర అర్ధరాత్రి దారి దోపిడి జరిగింది.

Palnaduలో దారి దోపిడి

పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి శ్రీరామ్ చిట్స్ దగ్గర అర్ధరాత్రి దారి దోపిడి జరిగింది. రైల్వేస్టేషన్‌ నుంచి తాలుకా సెంటర్‌ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను దుండగులు దోచుకున్నారు. భక్తులపై కర్రలతో దాడి చేసిన దుండగులు వారి వద్ద నుంచి రూ.5వేలు, వాచీలు, సెల్‌ఫోన్లను అపహరించారు. దుండగుల దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-23T13:40:11+05:30 IST