మానవతా దృష్టితో ప్రభుత్వం వెంటనే స్పందించాలి: పల్లె రఘునాధరెడ్డి

ABN , First Publish Date - 2022-07-05T22:50:59+05:30 IST

ఏడుకొండలు అనే వ్యక్తికి చెందిన బోటులో నలుగురు చేపల వేటకి వెళ్లారని టీడీపీ నేత పల్లె రఘునాధరెడ్డి తెలిపారు.

మానవతా దృష్టితో ప్రభుత్వం వెంటనే స్పందించాలి: పల్లె రఘునాధరెడ్డి

కృష్ణా: ఏడుకొండలు అనే వ్యక్తికి చెందిన బోటులో నలుగురు చేపల వేటకి వెళ్లారని టీడీపీ నేత పల్లె రఘునాధరెడ్డి తెలిపారు. వాళ్ల ఆచూకీ కనిపించకపోయనా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారి కుటుంబ సభ్యులు అందరూ ఆందోళనతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృష్టితో ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. వారి ఆచూకీ కనుగొనే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే హెలికాప్టర్, యుద్ద విమానాలను రప్పించి అయినా ఆచూకీ కనుగొనేలా చూడాలన్నారు. మచిలీపట్నం మండలం క్యాంబెల్‌పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మత్స్యకారుల కుటుంబాలను టీడీపీ బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

Updated Date - 2022-07-05T22:50:59+05:30 IST