శ్రీధర్‌రెడ్డీ.. నీ బాగోతం బయటపెడతా..

ABN , First Publish Date - 2022-05-17T05:38:37+05:30 IST

ఎమ్మెల్యే దు ద్దుకుంట శ్రీధర్‌రెడ్డిపై మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి ని ప్పులు చెరిగారు. ‘నీ అవినీతి బాగోతం బయట పెడతానం’ టూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

శ్రీధర్‌రెడ్డీ.. నీ బాగోతం బయటపెడతా..

మామా అల్లుళ్ల అక్రమ వసూళ్లు నిజం కాదా..?

మాజీ మంత్రి పల్లె ధ్వజం

పుట్టపర్తి, మే 16: ఎమ్మెల్యే దు ద్దుకుంట శ్రీధర్‌రెడ్డిపై మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి ని ప్పులు చెరిగారు. ‘నీ అవినీతి బాగోతం బయట పెడతానం’ టూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  సోమవారం టీడీపీ స్థానిక కార్యాలయంలో పల్లె.. విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో మామాఅల్లుళ్లు (ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి, ఆ యన మామ కొండారెడ్డి) సాగిస్తున్న అవినీతి బా గోతం ప్రజలకు తెలుసన్నారు. ‘ప్రశాంతంగా ఉన్న పుట్టపర్తిలో అక్రమ వసూళ్లు, దందాల సంస్కృతికి తెరలేపింది మీరు కాదా? నీతినిజాయతీగా బతుకుతున్న నన్ను.. నువ్వా విమర్శించేది’ అంటూ పల్లె మండిపడ్డారు. ప్రతి బిల్డింగ్‌కు పదిలక్షల రూపాయ లు కప్పం కట్టాలని ఆర్డర్‌ చేస్తూ రియల్‌ ఎస్టేట్‌ను సర్వనాశనం చేశారన్నారు. కప్పాలకు భయపడి బి ల్డర్లు బెంగుళూరు పారిపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్లాట్లువేసినా, రిజిస్ట్రేషన్లు చేసినా కమీషన్లు వదల్లేదన్నారు. ఎమ్మెల్యే అవినీతి బాగోతాన్ని, అక్రమాల చిట్టాను త్వరలోనే విప్పుతానన్నారు. అవినీతి బాగోతంపై సత్యమ్మ దేవాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాల్‌ విసిరారు. మామను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే సాగిస్తున్న అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారనీ, ఎన్నికల్లో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


Updated Date - 2022-05-17T05:38:37+05:30 IST