భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ
ABN , First Publish Date - 2022-05-24T05:52:09+05:30 IST
ఉమామహేశ్వర క్షేత్రంలో సోమవారం అమ్మవారిని పల్లకిసేవలో ఊరేగింపుగా పాపనాశిని గుండం వరకు తీసుకెళ్లి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అచ్చంపేటఅర్బన్, మే 23: ఉమామహేశ్వర క్షేత్రంలో సోమవారం అమ్మవారిని పల్లకిసేవలో ఊరేగింపుగా పాపనాశిని గుండం వరకు తీసుకెళ్లి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోకి తీసుకువచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు, కమిటీ చైర్మన్ కందూరు సుధాకర్ల ఆధ్వర్యంలో అర్చకులు వీరయ్య, రాజశేకర్, రామ్మూర్తిలు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈశ్వరునికి అభిషేకాలు చేశారు. అమ్మవారికి కుంకుమార్చన, గణపతి అయ్యప్ప స్వాములకు పూజలు చేశారు. ఆలయ ఆవరణలో అమ్మవారికి భక్తులు కుంకుమార్చన చేశారు.