ఆదర్శ మునిసిపాలిటీగా పలాస-కాశీబుగ్గ

ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST

ఆదర్శ మునిసిపాలిటీగా పలాస-కాశీబుగ్గను తీర్చిదిద్దుతానని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. సోమవారం పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీలోని 10, 12 వార్డుల్లో పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం తోపాటు ర్యాలీ నిర్వహించారు.

ఆదర్శ మునిసిపాలిటీగా పలాస-కాశీబుగ్గ
వార్డులో పర్యటిస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు


 మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

పలాస, జూన్‌ 21: ఆదర్శ మునిసిపాలిటీగా పలాస-కాశీబుగ్గను తీర్చిదిద్దుతానని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. సోమవారం పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీలోని 10, 12 వార్డుల్లో  పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం తోపాటు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కాశీగుండం, జక్కరగుండం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైర్మన్‌ బళ్ల గిరిబాబు మాట్లాడుతూ చెత్తరహిత మునిసిపాలిటీగా తీర్చిదిద్ద డానికి ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా  కౌన్సిలర్లు ఎస్‌.గీత, పోతనపల్లి ఉమాకుమారి వార్డుల్లో  సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కార్యక్రమంలో కమిషనర్‌ డి.రాజగోపాలరావు,  వైస్‌చైర్మన్‌ బోర కృష్ణారావురెడ్డి, కోట్ని దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST