భారతదేశంలో రైల్వే ట్రాక్ పేల్చివేతకు Pakistan ISI కుట్ర...ఇంటెలిజెన్స్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-05-23T17:12:55+05:30 IST

భారత దేశంలో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ కుట్ర పన్నిందని తాజాగా వెల్లడైంది...

భారతదేశంలో రైల్వే ట్రాక్ పేల్చివేతకు Pakistan ISI కుట్ర...ఇంటెలిజెన్స్ హెచ్చరిక

న్యూఢిల్లీ: భారత దేశంలో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ కుట్ర పన్నిందని తాజాగా వెల్లడైంది. పంజాబ్ రాష్ట్రంతోపాటు చుట్టుపక్కల ఉన్న రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాక్ ఐఎస్ఐ కేంద్ర ఇంటెలిజెన్స్ తాగా హెచ్చరించింది. సరుకుల రవాణా చేసే రైళ్లను పేల్చివేసేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐతో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని భారత నిఘా సంస్థల అధికారులు తాజా బులెటెన్‌లో హెచ్చరించారు.రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఐఎస్‌ఐ భారతదేశంలోని తన కార్యకర్తలకు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు  అలర్ట్‌ చేశాయి. భారత్‌లో ఉన్న పాక్‌ స్లీపర్‌ సెల్స్‌కు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారని ఇంటెలిజెన్స్ వివరించింది.


Updated Date - 2022-05-23T17:12:55+05:30 IST