కర్ణాటకలో పాక్ మహిళ అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-11T15:39:14+05:30 IST

మూడు నెలల పర్యాటక వీసాపై భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ అక్రమంగా కర్ణాటక రాష్ట్రంలో నివాసముంటుండగా....

కర్ణాటకలో పాక్ మహిళ అరెస్ట్

బెంగళూరు (కర్ణాటక): మూడు నెలల పర్యాటక వీసాపై భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ అక్రమంగా కర్ణాటక రాష్ట్రంలో నివాసముంటుండగా పోలీసులు అరెస్టు చేశారు.2014లో పాకిస్థాన్ జాతీయురాలైన ఖతీజా మెహ్రీన్ దుబాయ్ లో నివాసముంటున్న కర్ణాటక భట్కల్ వాసి మొహియుద్దీన్ రుక్కుద్దీన్ ను వివాహం చేసుకున్నారు.పెళ్లి అనంతరం పాక్ వాసి ఖతీజా భర్తతో కలిసి మూడు నెలల పర్యాటక వీసాపై 2015లోవచ్చి అక్రమంగా భారతదేశంలో ఉంటోంది. ఖతీజాకు ముగ్గురు పిల్లలు జన్మించారు.పాక్ వాసి ఖతీజా అక్రమంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపుకార్డులు పొందింది. పోలీసులు ఖతీజాను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Updated Date - 2021-06-11T15:39:14+05:30 IST