గద్దె దిగానో.. నన్ను మీరు తట్టుకోలేరు !
ABN , First Publish Date - 2022-01-25T18:30:16+05:30 IST
గద్దె దిగానో.. నన్ను మీరు తట్టుకోలేరు !
ప్రతిపక్షాలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరిక
న్యూఢిల్లీ, జనవరి 24: ‘‘ప్రభుత్వంలో లేకపోతే నాకంటే ప్రమాదకరమైన వ్యక్తి ఇంకొకడు ఉండడు. నేను రొడ్డెక్కానంటే దాక్కోవడానికి మీకు చోటు కూడా ఉండదు’’ పాకిస్థాన్ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలివి. ఆన్లైన్ వేదికగా ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో దేశ ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఇమ్రాన్ బదులిచ్చారు. అయితే, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఇమ్రాన్ విఫలమయ్యారంటూ.. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మార్చి 23న లాంగ్ మార్చ్ నిర్వహణకు పిలుపునిచ్చాయి. దాని గురించి ఓ వ్యక్తి ప్రశ్నించగా.. ఇమ్రాన్ ఘాటుగా బదులిచ్చి ప్రతిపక్షాలను హెచ్చరించారు.