విండీస్ క్యాంపులో కరోనా కలకలం.. పాక్‌తో వన్డే సిరీస్ వాయిదా

ABN , First Publish Date - 2021-12-17T02:19:33+05:30 IST

పాకిస్థాన్-వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ వాయిదా పడింది. విండీస్ క్యాంపులో మరో..

విండీస్ క్యాంపులో కరోనా కలకలం.. పాక్‌తో వన్డే సిరీస్ వాయిదా

కరాచీ: పాకిస్థాన్-వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ వాయిదా పడింది. విండీస్ క్యాంపులో మరో ఐదుగురు కరోనా బారినపడడంతో ఇరు జట్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) సంయుక్తంగా గురువారం ఓ ప్రకటన విడుదల చేశాయి.


విండీస్ ఆటగాళ్లు, ఇతర సభ్యులకు బుధవారం పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా మరో ఐదుగురికి కరోనా వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. వీటితో కలుపుకుని విండీస్ క్యాంపులో వైరస్ బారినపడిన వారి సంఖ్య 9కి పెరిగింది. 

Updated Date - 2021-12-17T02:19:33+05:30 IST