పాక్ ఆర్మీ కాల్పులను తిప్పికొట్టిన భారత సైనికులు

ABN , First Publish Date - 2020-09-29T14:06:18+05:30 IST

జమ్మూకశ్మీరులోని పూంచ్ జిల్లా మాన్ కోటి సెక్టారులో సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మంగళవారం ఉదయం పాకిస్థాన్ సైనికులు కాల్పులకు దిగారు....

పాక్ ఆర్మీ కాల్పులను తిప్పికొట్టిన భారత సైనికులు

పూంచ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని పూంచ్ జిల్లా మాన్ కోటి సెక్టారులో సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మంగళవారం ఉదయం పాకిస్థాన్ సైనికులు కాల్పులకు దిగారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైనికులు నియంత్రణ రేఖ వద్ద  చిన్న ఆయుధాలు, షెల్లింగులు, మోర్టార్లతో కాల్పులకు తెగబడ్డారు. దీంతో భారత సైనికులు అప్రమత్తమై పాక్ సైనికుల కాల్పులను తిప్పికొట్టారని జమ్మూ సైనిక విభాగం రక్షణ శాఖ పౌరసంబంధాల శాఖ అధికారి చెప్పారు. 


భారత సైనికుల ప్రతికాల్పులతో పాక్ సైనికులు తోక ముడిచి పారిపోయారు. తరచూ పాక్ సైనికులు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు దిగుతున్నారు. భారత సైనికులు పాక్ దాడిని సమర్థంగా తిప్పికొట్టారు.

Updated Date - 2020-09-29T14:06:18+05:30 IST