పూంచ్పై పాక్ మళ్లీ కాల్పులు...
ABN , First Publish Date - 2020-08-10T00:53:42+05:30 IST
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ..
పూంచ్: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా షాపూర్, కిర్ని, కృష్ణ ఘటి సెక్టార్లలో కాల్పులకు తెగబడింది. తేలికపాటి ఆయుధాలు, మోర్టార్లతో దాడులు చేసింది. ఆదివారం సాయంత్ర 5.50 గంటలకు ఈ కాల్పులు జరిపింది. దీంతో అప్రమత్తమైన భారత సరిహద్దు బలగాలు పాక్ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఉదయం కూడా ఎల్ఏసీ వెంబడి మాన్కోతే సెక్టార్పై మోర్టార్ షెల్స్తో, తేలికపాటి ఆయుధాలతో పాక్ బలగాలు కాల్పులకు దిగాయి.