Pakistan Terror Attack: పాక్లో ఉగ్రదాడి... ఎనిమిదిమంది దుర్మరణం!
ABN , First Publish Date - 2021-07-14T17:53:38+05:30 IST
పాకిస్తాన్లో మరోమారు ఉగ్రవాద దాడి జరిగింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరోమారు ఉగ్రవాద దాడి జరిగింది. చైనాకు చెందిన ఇంజినీర్లు, పాకిస్తాన్ సైనికులతో వెళుతున్న బస్సులో ఐఈడీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ఇంజినీర్లతో సహా ఎనిమిదిమంది మృత్యువాత పడగా, పలువురు గాయాలపాలయ్యారు. పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు దసూ డ్యామ్ వద్ద పనిచేస్తున్న చైనా ఇంజినీర్లను తీసుకుని వెళుతోంది. ఆ సమయంలో బస్సులో 30 మంది ఇంజినీర్లు, కార్మికులు ఉన్నారు. ఈ బస్సుకు పాకిస్తాన్ సైనికులు రక్షణను కల్పిస్తున్నారు. ఉన్నట్టుండి బస్సులో పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఇప్పటివరకూ ఎనిమిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని సమాచారం. క్షతగ్రాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ దాడి వెనుక తహరీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్(టీపీపీ) హస్తముండవచ్చని అధికారులు భావిస్తున్నారు.