భారత దౌత్యాధికారికి పాక్‌ సమన్లు

ABN , First Publish Date - 2020-07-07T13:50:49+05:30 IST

భారత దౌత్య కార్యాలయ అధికారికి పాక్‌ సమన్లు జారీ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నికియాల్‌ సెక్టార్‌లో భారత్‌ కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్‌ ఆరోపించింది.

భారత దౌత్యాధికారికి పాక్‌ సమన్లు

ఇస్లామాబాద్‌, జూలై 6: భారత దౌత్య కార్యాలయ అధికారికి పాక్‌ సమన్లు జారీ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నికియాల్‌ సెక్టార్‌లో భారత్‌ కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్‌ ఆరోపించింది. ఈ కాల్పుల్లో తమ దేశ పౌరులు ఐదుగురు గాయపడ్డారని, వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని భారత్‌ను పాకిస్థాన్‌ కోరింది.

Updated Date - 2020-07-07T13:50:49+05:30 IST