భారత్ సరిహద్దు దాటుతూ భద్రతా దళాలకు చిక్కిన పాక్ యువకుడు.. అతను ఎందుకు బోర్డర్ దాటాడో తెలిస్తే షాక్..!

ABN , First Publish Date - 2021-12-28T22:45:24+05:30 IST

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల భారత్ సరిహద్దు దాటుతూ భద్రతా దళాలకు చిక్కాడు..

భారత్ సరిహద్దు దాటుతూ భద్రతా దళాలకు చిక్కిన పాక్ యువకుడు.. అతను ఎందుకు బోర్డర్ దాటాడో తెలిస్తే షాక్..!

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల భారత్ సరిహద్దు దాటుతూ భద్రతా దళాలకు చిక్కాడు.. అతడిని అదుపులోకి తీసుకున్న సైన్యం విచారణ ప్రారంభించింది.. అతడు ఎందుకు బోర్డర్ దాటాడో విని షాకైంది.. ముంబైలో ఉన్న తన ప్రేయసిని కలిసేందుకే భారత్‌లోకి ప్రవేశించానని ఆ యువకుడు చెప్పాడు.. దీంతో సైన్యం అతడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తోంది.. రాజస్థాన్‌లోని సరిహద్దు ప్రాంతం శ్రీ గంగానగర్‌‌లో ఈ ఘటన జరిగింది. 


పాకిస్థాన్‌లోని హసిల్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఆమిర్‌(22)అనే యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా ముంబైకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆమెను నేరుగా కలవాలనుకున్నాడు. వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతని వీసా అప్లికేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో అతను అక్రమంగా సరిహద్దు దాటాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సైన్యం చేతికి చిక్కాడు. 


సరిహద్దు భద్రతా దళానికి చెందిన పెట్రోలింగ్ బృందం ఆ యువకుడిని పట్టుకున్నప్పుడు అతడి వద్ద మొబైల్ ఫోన్, కొన్ని కరెన్సీ నోట్లు మాత్రమే ఉన్నాయి. ఆమిర్ చెప్పిన వివరాలు నిజమా? కాదా? అని భద్రతా సంస్థలు విచారణ ప్రారంభించాయి. విచారణ పూర్తయ్యాకే అతడిపై చర్యలు తీసుకుంటామని  ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-12-28T22:45:24+05:30 IST