దైవదూషణ కేసులో హిందూ టీచర్‌కు Pakistan Court జీవిత ఖైదు

ABN , First Publish Date - 2022-02-09T16:38:27+05:30 IST

దైవదూషణ కేసులో హిందూ టీచర్‌కు పాకిస్థాన్ కోర్టు జీవిత ఖైదు విధించింది...

దైవదూషణ కేసులో హిందూ టీచర్‌కు Pakistan Court జీవిత ఖైదు

ఇస్లామాబాద్: దైవదూషణ కేసులో హిందూ టీచర్‌కు పాకిస్థాన్ కోర్టు జీవిత ఖైదు విధించింది.1947 వ సంవత్సరం నుంచి దైవదూషణ కేసుల్లో 18 మంది మహిళలు, 71 మంది పురుషులను ఉరి తీశారు.పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో దైవదూషణకు పాల్పడినందుకు గానూ ఓ హిందూ కాలేజీ టీచర్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. సెషన్ కోర్టు దోషికి 50,000రూపాయల జరిమానా కూడా విధించింది.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న నౌతన్ లాల్ దైవదూషణ కేసులో 2019లో అరెస్టయ్యాడు. అతను అండర్ ట్రయల్ ఖైదీగా జైలులో ఉన్నాడు.ఈ సమయంలో అతని బెయిల్ దరఖాస్తును కోర్టు రెండుసార్లు తిరస్కరించింది. 2019వ సంవత్సరం సెప్టెంబరు 14వ తేదీన నౌతన్ లాల్ దైవదూషణకు పాల్పడినట్లు ఒక విద్యార్థి పేర్కొన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ అయింది.


Updated Date - 2022-02-09T16:38:27+05:30 IST